కృష్ణ శతకం (Krishna Shathakam) - 12
చిలుకనొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!
ప్రతిపదార్థం:-
కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; ఒక రమణి అంటే ఒక స్త్రీ; ముద్దులు చిలుకను అంటే అందంగా, ముద్దులొలికేలా; చిలుకన్ అంటే ఒక చిలుకను; శ్రీరామ + అనుచు అంటే శ్రీరామా అని పలికేలా; శ్రీపతి అంటే విష్ణుమూర్తి యొక్క; పేరున్ అంటే పేరును; పిలిచినన్ అంటే పలికినంతచేతనే; మోక్షమున్ అంటే మోక్షాన్ని; ఇచ్చితివి అంటే అనుగ్రహించావు; మిమున్ అంటే భగవంతుడవైన నిన్ను; తలచు అంటే స్మరించే; జనులకున్ అంటే మామూలు మనుషులకు లభించటంలో; అరుదా అంటే లభించదా (లభిస్తుంది).
భావం:-
ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం.
ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.
చిలుకనొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!
ప్రతిపదార్థం:-
కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; ఒక రమణి అంటే ఒక స్త్రీ; ముద్దులు చిలుకను అంటే అందంగా, ముద్దులొలికేలా; చిలుకన్ అంటే ఒక చిలుకను; శ్రీరామ + అనుచు అంటే శ్రీరామా అని పలికేలా; శ్రీపతి అంటే విష్ణుమూర్తి యొక్క; పేరున్ అంటే పేరును; పిలిచినన్ అంటే పలికినంతచేతనే; మోక్షమున్ అంటే మోక్షాన్ని; ఇచ్చితివి అంటే అనుగ్రహించావు; మిమున్ అంటే భగవంతుడవైన నిన్ను; తలచు అంటే స్మరించే; జనులకున్ అంటే మామూలు మనుషులకు లభించటంలో; అరుదా అంటే లభించదా (లభిస్తుంది).
భావం:-
ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం.
ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.
No comments:
Post a Comment