Monday, November 11, 2019

నరసింహ శతకం (Narasimha Shatakam) - 13

నరసింహ శతకం (Narasimha Shatakam) - 13

మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత,
యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత,
యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల,
దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత,
యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:
భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!

No comments:

Post a Comment