Sunday, July 14, 2019

నరసింహ శతకం (Narasimha Shatakam) - 1

నరసింహ శతకం (Narasimha Shatakam) - 1

ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడి వారికి బరమ సుఖము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:-
ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం!

No comments:

Post a Comment